కొండాపూర్, ఫిబ్రవరి 14 : వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతో పాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సెకండ్ సీజన్ మంగళవారం నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్కు సంబంధించిన వివరాలను మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లీగ్ సీఈవో జాయ్ భట్టాచార్య వెల్లడించారు. లీగ్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, గత సీజన్తో పోల్చితే ఈ సీజన్కు మరింత ఆదరణ పెరిగిందన్నారు.
బెంగుళూరులో ప్రారంభమైన లీగ్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో కొనసాగనున్నట్లు తెలిపారు. లీగ్ ద్వారా యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ జట్టు యజమాని అభిషేక్రెడ్డి మాట్లాడుతూ గత సీజన్తో పోల్చితే హైదరాబాద్ జట్టు మెరుగ్గా రాణిస్తుందని, లీగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చుతూ నగరవాసులకు ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కెప్టెన్ ప్రశాంత్తో పాటు మిగతా జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.