ఢిల్లీ: ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్కు ఢిల్లీ జిప్మర్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప్మర్ వివాదాస్పద సర్క్యులర్ను వెనక్కి తీసుకున్నది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
‘జిప్మర్ ఆదేశాలు భాష ఆధిపత్యాన్ని పునరావృతం చేస్తున్నాయి. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి.
తెలుగు, మలయాళం, తమిళం, హిందీతో సహా ఇతర భాషలు ఇందులో ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలి. ఇలాంటి ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించకూడదని’ కేటీఆర్ పేర్కొన్నారు.
జిప్మర్ ఆదేశాలపట్ల కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మాతృభాషలో మాట్లాడొద్దని ఆదేశాలివ్వడమేంటనీ ప్రశ్నించారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎంపీ పేర్కొన్నారు.
This directive reeks of language chauvinism 👇
— KTR (@KTRTRS) June 6, 2021
India has 22 official languages & Malayalam, Telugu, Tamil, Hindi etc are included
Every Indian should have the right to converse in a language of their choice & no one should infringe on that basic right pic.twitter.com/noIVoCZtBQ