కరోనా పరిస్థితుల్లోనూ వృద్ధిపథం
బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్టే
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వ్యాపార నిర్వహణ, అన్నింటికి మించి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత.. తెలంగాణను ఏరోస్పేస్కు గమ్యస్థానంగా మార్చుతున్నాయని గ్లోబల్ విమానయాన దిగ్గజం బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్టే అన్నారు. విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి తమ సంస్థ హైదరాబాద్ను తయారీ కేంద్రంగా చేసుకొన్నట్టు చెప్పారు. గ్లోబల్ సైప్లె చెయిన్కు దోహదపడేలా తమ ఉత్పత్తులను వృద్ధి చేసుకొనేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ నిరంతరం వృద్ధిని సాధిస్తున్నదన్నారు. శనివారం సలీల్ గుప్టే ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగానికి అనుకూలమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం తగిన చర్యలు తీసుకుంటున్నదన్నారు. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్)తో ఒ ప్పందం ప్రకారం టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ భాగస్వామి రఘువంశీ సంస్థ.. ఆదిభట్లలో విడిభాగాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నదని, అక్కడ 300 మందికిపైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. జీడిమెట్లలోని ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థతోనూ కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.