Mohith Rao | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చట్టవిరుద్ధమని అడ్వకేట్ మోహిత్రావు పేర్కొన్నారు. అరెస్ట్ విషయంలో ఈడీ చట్టవిరుద్ధం గా వ్యవహరించిందని విమర్శించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారని తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగిందని, విమాన టికెట్లను ముందుగా బుక్ చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు.
కవిత అరెస్టు నేపథ్యంలో మోహిత్రావు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసును సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వే సిందని, కేసు పూర్తయ్యే వరకు కవిత పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో చెప్పిందని గుర్తుచేశారు. కవిత అరెస్ట్ను కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. న్యాయపోరాటం చేస్తామని, న్యాయవాదులతో చర్చించి శనివారం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.