హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు కృషి చేయాలని బీఎంఐ (బిహేవియర్ మూమెంట్ ఇండియా) ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ స్మితా అవస్థి కోరారు. సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెం ట్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిసెబులిటీ (ఎన్ఐఈపీఐడీ)లో ‘ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ -ఇన్నోవేషన్ ఇన్ డిసెబులిటీ రిహాబిలిటేషన్’ అంశంపై ఎన్ఐఈపీఐడీ డైరెక్టర్ డాక్టర్ అమృత సహాయ్ నేతృత్వంలో గురువారం జాతీయ సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్మితా అవస్థి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ఆధారంగా దివ్యాంగులకు మెరుగైన పునరావాసం, సేవలను అందించే దిశగా చర్య లు చేపట్టాలని సూచించారు. రోజురోజుకూ పురోభివృద్ధి సాధిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, తదితర సాంకేతికతతో సేవలందించాలని కోరారు. పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులు, వి ద్యార్థులు తమ ఆవిషరణలను ప్రదర్శించారు. సెమినార్లో ఆర్ఎంఎల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ స్మితా దేశ్పాండే, సీడీఏసీ డైరెక్టర్ డాక్టర్ ఎస్డీ సుదర్శన్, రెయిన్బో హాస్పిటల్స్ డాక్టర్ లోకేశ్ లింగప్ప, ప్రొఫెసర్ లలిత, బీవీ రామ్కుమార్, ఎన్ఐఈపీఐడీ డైరెక్టర్ డాక్టర్ అమృత సహాయ్, 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.