Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వచ్చే నెల 16న నిర్వహించనున్న అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి వచ్చే నెల 18వ తేదీన నిర్వహించనున్నామన్నారు. పరీక్షా కేంద్రం, పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతల వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.