భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20: కల్తీపాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో దాడులు చేశారు. భీమనపల్లికి చెందిన కప్పల రవి ఇంట్లో 350 లీటర్ల కల్తీ పాలు, 100 మిల్లీమీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు, కనుముకుల గ్రామంలో కుంభం రవి ఇంట్లో 100 లీటర్ల కల్తీ పాలు, 200 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు లభించినట్టు ఎస్సై విక్రంరెడ్డి తెలిపారు.