ఐనవోలు, డిసెంబర్ 4: మైనార్టీ గురుకులాల్లో అడ్డదారిలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు పోలీస్స్టేషన్లో ఏసీపీ నరేశ్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. సిద్దిపేట జిల్లా దూల్పేట్ మండలం కోటిగల్ రెడ్యానాయకర్ తండాకు చెం దిన భూక్యా సుమన్ వర్ధన్నపేట మైనార్టీ గురుకులంలో ఔట్ సోర్సింగ్ కింద ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. విద్యార్థులు అడ్మిషన్ కావాలంటే టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ నుంచి సంబంధిత సీట్లు ఖాళీలు ఉన్న గురుకులాలకు మెయి ల్ వస్తుంది. దీన్ని గుర్తించిన సుమన్ తప్పుడు అడ్మిషన్ కాపీ సృష్టించి గురుకులాలకు డూప్లికేట్ మెయిల్ పంపాడు. ఈ రకంగా అతడు వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, జనగామ, తొ ర్రూరు, డోర్నకల్ తదితర మైనార్టీ గురుకులాల్లో సుమారు 90 మంది విద్యార్థులకు 18 డూప్లికేట్ ఆర్డర్ కాపీలతో అడ్మిషన్లు ఇప్పించాడు. ఈ మేరకు రూ. 18.75 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. నకిలీ వ్యవహారం బయటపడ టంతో సుమన్ను అరెస్టు చేశారు.