హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎం ట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) మొదటి విడత కౌన్సెలింగ్లో అత్యధికులు యూనివర్సిటీ క్యాంపస్ కా లేజీల్లోనే చేరారు. దీంతో క్యాంపస్ కాలేజీల్లో 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. అనుబంధ కాలేజీల్లో (ప్రైవేట్ కాలేజీల్లో) విద్యార్థులు అంతంత మాత్రంగానే చేరారు. ఇదివరకు ఏడు యూనివర్సిటీల్లో మాత్రమే సీపీగెట్ ద్వారా సీట్లను భర్తీచేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళావర్సిటీలో విశ్వవిద్యాలయం కోటాలో పీజీ సీట్లను భర్తీచేశారు. క్యాంపస్ కాలేజీల్లో హాస్టల్ వసతి, నా ణ్యమైన విద్య, గ్రంథాలయం, ప్రొఫెసర్ల మార్గనిర్దేశనం ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ కా లేజీల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
47% సీట్లు భర్తీ
సీపీగెట్లో ఈ ఏడాది తొలి విడత కౌన్సెలింగ్లో 47% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో 293 కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 45,201 సీట్లు ఉండగా 21,329 సీట్లు నిండాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసం నవంబర్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.