హైదరాబాద్, జనవరి12 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఏపీ ఆక్రమణ తదితర అంశాలపై కేంద్ర జల్శక్తి సెక్రటరీ నేతృత్వంలో ఈ నెల 15 నిర్వహించ తలపెట్టిన సమావేశం 17కి వాయిదా పడింది. సాగర్ ఘటన, ప్రాజెక్టుల స్వాధీనం, కేఆర్ఎంబీ నిర్వహణకు నిధుల విడుదల అంశాలపై న్యూఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని 15న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అదేరోజు పండుగ ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ర్టాలు కూడా విముఖత చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశం 17కి వాయిదా వేసినట్టు తెలిసింది.