హైదరాబాద్, ఫిబ్రవరి23 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన జీఆర్ఎంబీ (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) సమావేశం వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ శుక్రవారం లేఖ రాసింది. అదేరోజున ఏపీ సీఎం జగన్కు మరో సమావేశం ఉన్నదని, దీంతో బోర్డు సమావేశానికి హాజరుకాలేరని ఏపీ పేర్కొన్నది. ఈ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరింది.