ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. నామిషనేషన్లు కొనసాగుతున్నా ఇంకా టికెట్ల కేటాయింపుల్లో కొట్లాటలతో ఆ పార్టీ ఆగమాగవముతున్నది. తాజాగా బోథ్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్ను మార్చినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ హెచ్చరించారు. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్రెడ్డి(Revanth Reddy)అధ్యక్షుడు దిష్టిబొమ్మను దాహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 లక్షల,70 వేల పైచిలుకు జనాభా ఉన్న ఆదివాసీలను అవమానిస్తాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు. మీరు ఆదివాసీ అమాయకులను చూసి నాటి నుంచి నేటి వరకు ఆదివాసులను అనగతొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివాసులను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటా ఆస్తిత్వాన్ని, సంపదాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
1981లో మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంద్రవెల్లిలో ఆదివాసులను తూటాలతో కాల్చి మా శవాల మీద నడిచి మమ్ముల్ని, మా అస్తిత్వాన్ని సర్వం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయకుంటే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటాం. ఖానాపూర్ తప్పా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఇప్పటికైనా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బోథ్లో ఆదివాసీ లకే ఇవ్వాలని, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కమిటీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.