హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 4: తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నిట్లో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్లో పాల్గొన్న ఓ మల్టీనేషనల్ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసినట్టు వరంగల్ నిట్ డైరెక్టర్, ఆచార్య ఎన్వీ రమణారావు తెలిపారు.
ఇది వరంగల్ నిట్ చరిత్రలోనే రికార్డు ప్యా కేజీ అని ఆయన వెల్లడించారు. ఇక్కడి నిట్లో నాణ్యమైన బోధన, విస్తృతమైన పరిశోధనల వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ పేర్కొన్నారు.