ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలోని పల్లెలకు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ప్రశంసించారు.
మహారాష్ట్రలోని పుణెలో గురువారం ప్రారంభమైన రెండ్రోజుల జాతీయస్థాయి పంచాయతీరాజ్ సమ్మేళనానికి రాష్ట్రం నుంచి ముక్రా (కే) ఎంపిక చేయగా.. సర్పంచ్ మీనాక్షీ గాడ్గే హాజరయ్యారు. పల్లెప్రగతిలో భాగంగా చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసి ఆదాయం గడిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. పంచాయతీలు ఆదాయం సమకూర్చుకొని అభివృద్ధి పనులు చేపట్టడం ప్రశంసనీయమని మహాజన్ అన్నారు. వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన సర్పంచ్కు అవార్డు అందజేశారు.