యాదాద్రి: యాదాద్రీశుడి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యాదగిరి లక్ష్మినారసింహుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదోరోజైన సోమవారం వటపత్రసాయి అలంకారంలో స్వామివారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఉత్సవమూర్తులను దివ్వమనోహరంగా అలంకరించి బాలాలయ కల్యాణమండపంలో సేవోత్సవాలు నిర్వహించారు. వేదమంత్ర పఠనలు, మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవలు కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారంలో యాదాద్రీశుడు దర్శనమివ్వనున్నారు. కాగా, వార్షిక అధ్యయనోత్సవాల నేపథ్యంలో మొక్కు, శాశ్వత కల్యాణాలు, సుదర్శన హోమాలను అధికారులు రద్దు చేశారు.