యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో గత ఐదు రోజులుగా వేడుకగా జరిగిన ఆధ్యాయనోత్సవాలకు ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు మంగళవారం ముగింపు పలికారు. ఉత్సావాలలో భాగంగా స్వామి వారు నరసింహుడి అలంకారంలో ముస్తాబు చేసి, బాలాలయంలో పురప్పాట్ సేవను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ పారాయణం గావించి అధ్యయణోత్సవాలకు ముగింపు పలికారు. కాగా, అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను ఘనంగా ముగించారు.