హైదరాబాద్, మార్చి 26 (నమస్తేతెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేలో మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని రైల్వేస్-రోడ్ సేఫ్టీ ఏడీజీ మహేశ్ ఎం భగవత్ వెల్లడించారు. సికింద్రాబాద్లోని సంచాలన్ భవన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బచ్పన్ బచావో ఆందోళన్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడా రు.
దక్షిణ మధ్య రైల్వేలో 60 ఆర్పీఎఫ్, 6 జీఆర్పీ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2022లో 9 మంది ట్రాఫికర్లను అరెస్టు చేసి, 46 మంది, 2023లో 507 మంది పిల్లలను రక్షించి 184 మంది ట్రాఫికర్లను అరెస్టు చేశారని చెప్పారు. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ డివిజన్లోనే 3,017 మంది పిల్లలను రక్షించి 131 మంది ట్రాఫికర్ల ఆట కట్టించామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమాసింగ్ ఠాకూ ర్, సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ భరతేశ్కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.