నిజామాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు భూక్య చంద్రునాయక్(కారేపల్లి, భీంగల్ మండలం) తన అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. మన మంతా ఒకే గొడుగు కిందకు చేరి కేసీఆర్కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.