హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగా ణ అటవీ దళాల అధిపతిగా వినయ్కుమార్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అటవీశాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సీ సువర్ణ పదవీకాలం ఈ నెల 30న ముగియనుంది. దీంతో 1992 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో ఆయన అటవీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు.