ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని మహాత్మాగాంధీ పార్కులో ఆక్యుప్రెషర్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆక్యుప్రెషర్ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ పార్కులో 3,600 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇది తెలంగాణలో రెండో పార్కు.. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిది అని అధికారులు తెలిపారు. ఆక్యుప్రెషర్ పార్కును వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ పార్కును రూ. 7 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేశామన్నారు.
ఆక్కుప్రెషర్ పార్కులో కాంక్రీట్, నల్లమట్టిని ఉపయోగించి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. అయితే పార్కుకు వచ్చే సందర్శకులు ఈ ట్రాక్పై చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ట్రాక్ చుట్టూ పచ్చని చెట్లను నాటారు.
మానవ శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా వాకింగ్ చేసే వారితో పోలిస్తే ఈ ట్రాక్పై నడిచే వారిలో బీపీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పాదాలకు ఆచ్ఛాదన లేకుండా నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలూ యాక్టివ్గా పని చేస్తాయంటున్నారు. ఈ వ్యాయామంతో శారీరకంగానే కాకుండా.. మానసిక దృఢత్వమూ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.