Vijay Devarakonda | ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ విలువైన ఓటును వేయాలని పిలుపునిచ్చారు.
‘పోలింగ్ శాతం కొద్దిగా తక్కువగా ఉందని నేను విన్నాను. ఓటరు ఐడీ ఉన్న యువతీ యువకులందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ నగరం ఎంత కొత్తగా మారింది. లేని నీళ్ళు వచ్చాయ్. కరెంట్ వచ్చింది. అభివృద్ధి కొనసాగాలి.. ప్రశాంతమైన జీవితం గడపాలంటే తప్పకుండా ఓటేయాలి. ఓటేయడానికే ఇవాళ హాలిడే ఇచ్చారు. అందుకని అంతా వచ్చి ఓటేయండి. మీకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేయండి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశాను. మీరూ రండి.. ఓటేయండి’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.
#WATCH | Actor Vijay Deverakonda arrives at Jubilee Hills Public School in Hyderabad to cast his vote in Telangana Assembly elections pic.twitter.com/BkZmqbsHba
— ANI (@ANI) November 30, 2023
#WATCH | After casting his vote, Vijay Deverakonda says, “I heard that the polling percentage is a little low. I request all the young boys and girls who have their voting ID and election card to come and vote. Come with your families and vote, you should do it.” https://t.co/IEMcSrSGhQ pic.twitter.com/GbUShJCIpH
— ANI (@ANI) November 30, 2023
Also Read..
Minister KTR | పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్
TS Assembly Elections | మెదక్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్.. 1 గంటకు 36.68 శాతం మేర పోలింగ్ నమోదు
TS Assembly Elections | కొనసాగుతున్న పోలింగ్.. తొలిసారి ఓటు వేస్తున్న యువత