హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీసీలకు సంబంధించిన పలు సమస్యలపై బీసీ కమిషన్తో ప్రముఖ సినీనటుడు సుమన్ గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిశోర్గౌడ్ను ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో సుమన్ కలిశారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల తీరుతెన్నులు, పలు సామాజిక అంశాలను ప్రస్తావించారు. పలు సమస్యలను కమిషన్ ముందుంచి చర్చించారు. సుమన్ వెంట బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి, మహిళా సంఘాల ప్రతినిధులు, నాయకురాలు జీ పద్మ, పలు బీసీ కుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు.