హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ): కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు అందించిన సహాయ సహకారాలు అద్భుతమని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల దినోత్సవం (జనవరి 9) సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతిఏటా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకొంటున్నామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు 50కి పైగా దేశాలలో చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పారు.