హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నిరుడు మంజూరైన రోడ్ల రెన్యువల్ పనులను ఇంతవరకూ ప్రారంభించని ఇంజినీర్లకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన పంచాయతీరాజ్ సీఈలు, ఎస్ఈలు, ఈఈలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2021-22లో 1,412 పనులకు, 1,113 పనులు ప్రగతిలో ఉన్నాయని, 2022-23లో 1,597 పనులకు 1,082 పనులు ప్రగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. టెండర్లు పూర్తిచేసిన పనులన్నీ ఈ వారంలోగా నూరుశాతం గ్రౌండింగ్ కావాలని స్పష్టం చేశారు.