హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నకిలీ విత్తన విక్రేతలు, డీలర్లపై పోలీస్ శాఖ విస్తృతంగా దాడులు చేస్తోంది.
‘జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు నమోదు చేశాం. పోలీస్శాఖ చర్యల వల్ల రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద చాలా తగ్గింది. ఇప్పటి వరకు 851 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. 27 మంది నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశాం. 2014 నుంచి ఇప్పటి వరకు నకిలీ విత్తన విక్రేతలపై 602 కేసులు, 27 మందిపై పీడియాక్ట్ నమోదు చేశామని’ డీజీపీ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు దాడులు చేస్తున్నారు.