హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగా ణ): రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ఆచార్య ఎం విజ్జులత నియామకంపై దళిత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హ ర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రొఫెసర్ విజ్జులత నేతృత్వంలో మహిళా వర్సిటీ అన్ని విధాలుగా పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విప్లు బాల సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు క్రాంతి, చిరుమర్తి లింగయ్య, అరూరి రమేశ్, సండ్ర వెంకటవీరయ్య, గాదరి కిశోర్, హన్మంత్ షిండే, మానిక్రావు, అబ్రహాం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.