నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) పరిధిలో పలు దొంగతనాలకు(theft )పాల్పడిన నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దొంగతనానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వారి వద్ద నుంచి 1.6 తులాల బంగారం, ఐదు బైకులు, 21.9 తులాల సిల్వర్, 58.84 కి.గ్రా. బ్రాస్ ఐటమ్స్ , పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.