హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం తెలిపారు. ఈ విషయమై రాజస్థాన్ అధికారులతో ఆయన సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీశాఖ మంత్రి సలేహ్ మహమ్మద్, కలెక్టర్ అన్ష్లేదీప్, అభివృద్ధి విభాగపు అధికారి అక్షయ్ గోదార తదితర అధికారులతో కలిసి వసతి సదుపాయానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు దాదాపు రూ.2.40 కోట్ల నిధులు కేటాయించిందని హోంమంత్రి తెలిపారు.