కామారెడ్డి : కామారెడ్డి(Kamareddy)జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ఉన్న టోల్గేట్ను అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో పలువురు టోల్గేట్(Tollgate) సిబ్బందికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్(Container) అతివేగంగా వచ్చి భిక్కనూరు టోల్గేట్ను ఢీ కొట్టింది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న టోల్గేట్కు చెందిన సిబ్బందికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన టోల్గేట్ సిబ్బంది కంటైనర్ డ్రైవర్ ను చితకబాదారు. గాయపడ్డ టోల్ సిబ్బందిని, డ్రైవర్ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. భిక్కనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.