నిర్మల్ అర్బన్, నవంబర్ 4: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చాక్పెల్లికి చెందిన సయ్యద్ కరీం తన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కిరణ్ను ఆశ్రయించాడు.
ఆయన జూనియర్ అసిస్టెంట్ను కలువాలని సూచించారు. దీంతో కరీం జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ను కలిశాడు. పని కావాలంటే రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులు గత నెల 31న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం కార్యాలయంలో రూ.8 వేలు లంచం ఇస్తుండగా.. ఆ నగదును జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ తీసుకోకుండా ప్రైవేట్ అసిస్టెంట్ రాజు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసును నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.