మల్కాజిగిరి, ఏప్రిల్ 24: విద్యుత్తుశాఖ ఏఈ అనిల్కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో కీసరలో ఏఈగా పనిచేసిన అనిల్కుమార్ అప్పట్లో రూ.12 వేలు లంచం తీసుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో బొల్లారంలోని ఆయన నివాసంలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.34లక్షలు, 20తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.కోటి విలువైన స్థిరాస్తుల దస్తావేజులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అనిల్ సోదరుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించామని చెప్పారు.