నవాబ్పేట, నవంబర్ 4: భూ తగాదా కేసులో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు దొరికిపోయిన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట ఎస్సై పురుషోత్తంను శనివారం రిమాండ్ చేసి చంచల్గూడ జైలుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన భూ తగాదా విషయంలో నమోదైన కేసులో ఐదుగురి పేర్లు తొలగించేందుకు ఎస్సై పురుషోత్తంతో డీల్ మాట్లాడారు.
ఇందుకోసం అదే గ్రామానికి చెందిన గజ్జి శేఖర్ నుంచి ఎస్సై రూ.5 లక్షలను డిమాండ్ చేశారు. అయితే.. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు శుక్రవారం ఎస్సై పురుషోత్తంను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆడియో, వీడియో రికార్డింగ్ అధారంగా ఎస్సైపై కేసు నమోదు చేసినట్టు మాజీద్ తెలిపారు. హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా.. జడ్జి ఎస్సైకి 14 రోజుల రిమాండ్ను విధించగా.. చంచల్గూడ జైలుకు తరలించినట్టు వివరించారు.