హైదరాబాద్: హైదరాబాద్లోని విద్యాశాఖ ఆర్జేడీ (RJD) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు (ACB) మిగిశాయి. ఏడీ పూర్ణచందర్ రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్, ఆర్జేడీ పీఏ సతీశ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ముగ్గురిని రిమాండ్కు తరలించనున్నారు. ఈ ముగ్గురు సీబీఎస్ఈ స్కూల్ అనుమతి కోసం రూ.80 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి (CBSE) పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ విజయ లక్ష్మిని అధికారులు ప్రశ్నించనున్నారు. పాఠశాల అనుమతి విధివిధానాలను గురించి తెలుసుకోనున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కార్యాలయంలో అయోస్లా సాయి పూర్ణచందర్రావు ఏడీగా, దొడ్డి జగ్జీవన్ సూపరింటెండెంట్గా, ఆర్జేడీ పీఏగా జూనియర్ అసిస్టెంట్ సతీశ్ పని చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలానికి చెందిన శేఖర్ తన స్కూల్ను అప్గ్రేడ్ చేయాలని దరఖాస్తు చేసుకోగా, పని కావాలంటే ఏడీ, సూపరింటెండెంట్కు రూ.80 వేలు లంచం ఇవ్వాలని సతీశ్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం బాధితుడు సూపరింటెండెంట్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్కు 80 వేలు ఇవ్వగా, అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులతో పాటు ఆర్జేడీ పీఏను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.