ఢిల్లీ, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుకెదురైంది. నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను తోసిపుచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. సిట్ దర్యాప్తు స్వతంత్రంగా జరగాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తుపై ఏవిధమైన ఆంక్షలు ఉండరాదని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ లేదా కేంద్రం ఏర్పాటుచేసే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలన్న నిందితుల అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు సరిపోతుందని తేల్చి చెప్పింది. సిట్ దర్యాప్తుపై ఏవిధమైన ఆంక్షలు, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణ వంటివి అవసరం లేదని స్పష్టంచేసింది. నిందితుల రిమాండ్కు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు దాఖలు చేస్తూ దాఖలైన మరో ఎస్ఎల్పీని కూడా కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ల ధర్మాసనం సోమవారం రెండు ఎస్ఎల్పీల్లో వేర్వురుగా ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలను ఆమోదించింది. తెలంగాణ హైకోర్టులోని కేసును నాలుగు వారాల్లోగా పరిషరించాలని ఉత్తర్వులు జారీచేసింది.
సీబీఐ దర్యాప్తునకు నిరాకరణ
ఎమ్మెల్యేలకు ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరుగాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సవాల్ చేస్తూ రామచంద్రభారతి, ఇతరులు ఎస్ఎల్పీ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సిట్ కాకుండా కేసు దర్యాప్తును సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే సిట్కు బదిలీ చేయాలని వారు కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా, రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు వాదనలు వినిపించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ను వద్దంటూ.. మరోవైపు సీబీఐ లేదా కేంద్రం ఏర్పాటుచేసే సిట్కు దర్యాప్తును అప్పగించాలని కోరడం నిందితుల ద్వంద్వ వైఖరిని చాటుతున్నదని చెప్పారు. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నదని, హైకోర్టు కూడా సిట్ దర్యాప్తును అడ్డుకోలేదని, హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించిందని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, సిట్ దర్యాప్తుపై హైకోర్టు జడ్జి పర్యవేక్షణ ఎందుకని ప్రశ్నించింది. తిరిగి న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు జాతీ య స్థాయి పార్టీ తెరవెనుక కుట్ర చేసిందని తెలిపారు. సిట్ దర్యాప్తును అడ్డుకొనేందుకు హైకో ర్టు కూడా నిరాకరించిందని చెప్పారు.
ఎమ్మెల్యేల ఎర కేసుకూ తమ పార్టీకి సంబంధం లేదని చెబుతున్న ఆ పార్టీ నేతలు హైకోర్టులో రిట్లు వేశారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించి పలు సాక్ష్యాధారాలు ఉన్నాయని, క్రిమినల్ కేసును దర్యాప్తు దశలో అడ్డుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని అన్నారు. ఈ కేసులో అసలు దోషులు ఎవరో తేల్చాలనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, రాగద్వేషాలకు అతీతంగా సిట్ దర్యాప్తు చేయాలన్న లక్ష్యాన్ని అడ్డుకోవద్దని కోరారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి కుట్ర కోణాన్ని బట్టబయలు చేయాల్సివున్నదని అన్నారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ సిట్ దర్యాప్తునకు నిరాకరించింది. హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలన్న డివిజన్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. సిట్పై ఆంక్షలను ఎత్తేసింది. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని పేరొంది. ‘సిట్ దర్యాప్తు చేయాల్సిందే. సిట్పై ఆంక్షలు, షరతుల విధింపు చెల్లదు. దర్యాప్తు నివేదికను సీల్డ్కవర్లో సమర్పించాలన్న హైకోర్టు విధించిన షరతులు చెల్లవు. సిట్కు హైకోర్టు విధించిన కాలపరిమితి, ఇతర నియమనిబంధనల ఆంక్షలు రద్దు చేస్తున్నాం. నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది. ఈ వ్యవహారంపై దాఖలైన రిట్లను హైకోర్టు సింగిల్ జడ్జి నాలుగు వారాల్లోగా పరిషరించాలి’ అని పేరొంది.
రిమాండ్ ఉత్తర్వుల రద్దుకు నిరాకరణ
ఈ కేసులో నిందితులు మరో ఎస్ఎల్పీ దాఖలు చేస్తూ.. అన్ని కేసుల్లోనూ నిందితులకు 41-ఏ నోటీసు విధిగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయలేదని, ఏసీబీ కోర్టు నిందితులను రిమాండ్కు పంపాలంటూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. నిందితులకు 41-ఏ నోటీసు ఇవ్వకుండా రిమాండ్కు తరలించడం చెల్లదని వారి తరఫు సీనియర్ న్యాయవాది తన్మయ్ మెహతా వాదించారు. ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా, జే రామచందర్రావులు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకే ఆసారం లేదని, అవినీతి నిరోధక చట్టం వర్తించదని పిటిషనర్లు చెప్పడాన్ని వారు తీవ్రం గా ఖండించారు. పిటిషనర్లు లంచం ఇవ్వలేదు కాబట్టి ఆ చట్టం వర్తించదని, మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో డబ్బు దొరకలేదు కాబట్టి, డబ్బు లావాదేవీలు జరగలేదు కాబట్టి చట్టం వర్తించదని చెప్పడం సరికాదన్నారు.
ఆ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇస్తామని ఆశ చూపడం కూడా అవినీతి కిందకే వస్తుందని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం లంచం తీసుకునేవాళ్లతో సమానంగా లంచం ఇచ్చే వాళ్లను కూడా పరిగణించేందుకు వీలుందని, ఇద్దరికీ శిక్షలు విధించేందుకు చట్ట నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ట్రయల్ కోర్టు (ఏసీబీ కోర్టు) 41-ఏ నోటీసు ఇవ్వలేదని మాత్రమే చెప్పిందని, పోలీసుల కేసును ఎకడా తప్పుపట్టలేదని చెప్పా రు. నిందితులను రిమాండ్కు పంపాలని హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వాదనల తర్వాత.. లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడమూ నేరమేనన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. నిందితులు వేసిన ఎల్ఎల్పీని తోసిపుచ్చింది. నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని తెలిపింది.