హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ దర్యాప్తు చేయకుండానే తమపై అభియోగాలు మోపిందని ఆరోపిస్తూ పోలీసులు, పోలీస్ ఆఫీసర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి బుధవారం విచారణ ప్రారంభించారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసులను బాధ్యులుగా చేస్తూ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించి రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.