వాషింగ్టన్ డీసీలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మూడు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కరోనా తరువాత జరిగిన ఈ సమావేశాల్లో తెలుగు వాళ్లు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో 12 నగరాల నుంచి 15,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ఆళ్ల వేంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, బొళ్లం మల్లయ్య యాదవ్, గాదారి కిశోర్, సద్గురు జగ్గీ వాసుదేవ్, క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాసర్, క్రిస్ గేల్, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. సభల ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల.. మాతృదేశ సేవలో ముందుంటామని పేర్కొన్నారు.
న్యూజెర్సీలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను న్యూజెర్సీలో నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అమెరికాలోని తెలుగు వారు ఇచ్చిన ఆప్యాయతను మరిచిపోనని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చంటి క్రాంతి కిరణ్, కాలె యాదయ్య, టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.