హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఓటర్కార్డుకు ఆధార్ లింక్ చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీల ద్వారా ఓటర్లకు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బుధవారం తెలిపారు. ఇందుకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించామని వెల్లడించారు.