రాజన్న సిరిసిల్ల : వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనాయపల్లికి చెందిన గోస్కుల ప్రశాంత్ (23) అనే యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలగా ఉండేది. గత సంవత్సరం ఆర్మీ నిర్వహించిన టెస్ట్ లో పాస్ అయినప్పటికి రన్నింగ్ లో కాలు ఇబ్బంది పెట్టడంతో సెలెక్ట్ కాలేదు.
2 నెలల క్రితం నిర్వహించిన ఆర్మీ సెలక్షన్ లో కూడా విఫలం కావడంతో తన స్నేహితులు ఉద్యోగం చేస్తూ.. ఉండడంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రశాంత్ బుధవారం ఉదయం తన పంట పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.