Peddapalli | ఓదెల, మార్చి 18: పెండ్లి బరాత్లో డ్యా న్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంట నే స్థానికులు దవాఖానకు తరలించినా అప్పటికే మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్లో జరిగింది. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్కుమార్ (33) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలోని స్నేహితుడి పెండ్లి విందు వేడుకలో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం వచ్చాడు.
విందు అనంతరం ఇదే మండలంలోని కొలనూర్లో విజయ్కుమార్ మిత్రుడి పెండ్లి బరాత్కు హాజరయ్యాడు. ఇందు లో గంటల తరబడి డ్యాన్స్ చేస్తూ అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దవాఖానకు తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పొత్కపల్లి ఎస్సై అశోక్రెడ్డి తెలిపారు.