వికారాబాద్,డిసెంబర్ 01: ప్రమాదవశాత్తు బావి(well)లో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలం లింగనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మైస నరేష్ (23)అనే యువకుడు గురువారం రాత్రి ఎప్పటిలాగే అన్నంతిని నిద్రించాడు. నరేష్ తెల్లవారి చూసేసరికి ఇంట్లో లేకపోవడంతో గ్రామంలోని పొలాల దగ్గరకు వెళ్లి వెతకగా..కర్ణమోని బావిలో మృతదేహం లభిం చిందని వారు తెలిపారు. పొలానికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉంటాడని వారు పేర్కొన్నారు. నరేష్ మృతిపట్ల ఎవరిపై ఎలాంటి అనుమానం లేవని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.