మెదక్ : అప్పుల బాధతో ఓ యువ రైతు( Young farmer) ఉరివేసుకొని ఆత్మహత్య( committed suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మెదక్(Medak) జిల్లా నార్సింగి మండలం వల్లూర్లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూర్ గ్రామానికి చెందిన ఆనందాస్ మమేష్(35) అనే యువ రైతు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ భూమిని అప్పుల కోసం అమ్మడంతో తీవ్ర మనస్థాపం చెందిన మహేష్ చింత చెట్టకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.