వరంగల్, డిసెంబర్ 20 : లాడ్జి(Lodge)లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి(woman died) చెందిన ఘటన బుధవారం వరంగల్(Warangal) నగరంలో చోటుచేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ సీఐ ఎం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ చౌరస్తాలోని లాస్య లాడ్జిలో రామన్నపేటకు చెందిన ఎం శారద(45) ఓ వ్యక్తితో కలిసి మంగళవారం రాత్రి రూమ్ అద్దెకు తీసుకున్నారు. కాసేపటికి మహిళకు ఛాతిలో నొప్పి వస్తుందంటూ ఆ వ్యక్తి బయటకు వెళ్లాడు.
అతడు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు గదికి వెళ్లి చూడగా మహిళ మృతిచెంది ఉంది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో వెళ్లి మహిళ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. మహిళ మృతిపై అనుమానం ఉందంటూ ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మహిళతో లాడ్జికి వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది.