కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఓ పులి మృత్యువాతపడింది. ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. పులి కళేబరంపై ఉన్న గాయాల ఆధారంగా ఇటీవల ఆడ, మగ పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఆడ పులి చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అటవీ అధికారులు ఈ విషయాన్ని శనివారం గుర్తించారు. పులి మృతిపై అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా గత నెల 12న ఇదే అటవీ ప్రాంతంలో పశువుల కాపరిపై పులిదాడి చేసిన విషయం తెలిసిందే.