హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మిషన్ కాకతీయ ఫలితాలను నేరుగా అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన ముగ్గురు సభ్యుల అధికార బృందం 28న రాష్ర్టానికి రానున్నది. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ అనుబంధ రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్సింగ్, శాస్త్రవేత్తలు సంజయ్ సత్పుతే, అబ్రార్ యూసుఫ్ మార్చి 1, 2 తేదీల్లో మేడ్చల్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్సింగ్మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్, పలు చెరువులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాలతో అధికారుల బృందం తెలంగాణకు రానున్నది.