ములుగు రూరల్, డిసెంబర్ 26: సముద్రం మధ్యలో ఓడకు జరిగిన ప్రమాదంలో ములుగు జిల్లా తాడ్వా యి మండలం బయ్యక్కపేటకు చెంది న గుర్రం సమ్మిరెడ్డి ఏకైక కుమారుడు శ్రీమాన్(23) గల్లంతయ్యాడు. బీటెక్ పూర్తి చేసిన శ్రీమాన్ నవంబర్ 22న ఇరాన్లోని జైపూర్ రుద్రాక్ష కన్స్ట్రక్షన్ షిప్లో ఉద్యోగం వచ్చిందని వెళ్లాడు. గత శుక్రవారం ఏడుగురితో కలిసి సముద్ర మార్గాన షిప్ ట్రాన్స్పోర్టు విధుల్లో ఉన్నాడు.
అదే రోజు రాత్రి 8 గంటలకు షిప్ గల్లంతైంది. ఈ విషయాన్ని శ్రీమాన్తో పనిచేసే స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా బంధువులకు మంగళవారం సమాచారం అందించాడు.