నారాయణ పేట : నారాయణపేట(Narayanapet) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కిందపడి (Tractor accident) ఓ విద్యార్థి దుర్మరణం(Student died) చెందాడు. ఈ విషాదకర సంఘటన కృష్ణ మండలం కున్సి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆనంపల్లి గ్రామానికి చెందిన కావలి ప్రకాష్ అనే 9వ తరగతి విద్యార్థి.. ప్రతిరోజూ మాదిరిగానే గురువారం మిత్రులతో కలిసి సైకిల్ పై స్వగ్రామం ఆనంపల్లి నుంచి కున్సి గ్రామానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో కున్సి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ తగిలి కింద పడిపోయాడు. ట్రాక్టర్ ప్రకాష్ తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.