నాగర్కర్నూల్, మార్చి 19 : ఒకేరోజు పది మంది చిన్నారులపై శునకం దాడి చేసి గాయపరిచిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. నాగర్కర్నూల్ పట్టణంలోని ఎండబెట్ల గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిపూట బడి ముగియగానే ఇండ్లకు బయలుదేరిన చిన్నారులతోపాటు ఇండ్ల ముందు ఉన్న పిల్లలపై శునకం దాడి చేసింది.
ఒకే వీధి కుక్క దాడిలో సుమారు 10 మంది వరకు గాయపడ్డారు. చిన్నారులను జిల్లాకేంద్రంలోని జనరల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు.