బేగంపేట, మే 27: జీర్ణకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల (ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిసీజెస్-ఐబీడీ) చికిత్స కోసం కిమ్స్ దవాఖానలో స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభమైంది. కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు శనివారం ఈ సేవలను ప్రారంభించారు.
ఈ క్లినిక్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఐడీబీ చికిత్సా పద్ధతులపై వైద్యులకు ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపా రు. కార్యక్రమంలో కిమ్స్ గ్యాస్ట్రో ఎం టరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, హైదరాబాద్ సీసీఎంబీ డైరక్టర్ డాక్టర్ వినయ్ పాల్గొన్నారు.