హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కేం ద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓబీసీలకు చెందిన 15 డిమాండ్లపై కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి భూపేంద్రయాదవ్కు ఢిల్లీలో శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు. అసంఘటిత రంగ కార్మికులైన బీసీ చేతివృత్తిదారులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు బీసీ విద్యార్థులకు సాలర్షిప్ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్యాదవ్, బీసీ నేతలు, న్యాయవాది చంద్రశేఖర్, ఓం ప్రకాశ్ ఉన్నారు.