నారాయణపేట : ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలిపోయాడు. కోస్గి మండలం మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ లబిద్కు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో పాఠశాలలోనే కుప్పకూలిపోయాడు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రధానోపాధ్యాయుడి మృతిపట్ల విద్యార్థులు, మీర్జాపూర్ వాసులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.